రహదారి పూర్తి చేయాలని ధర్నా.. అరెస్టు
27 Jun, 2017 12:05 IST
వైయస్ఆర్ జిల్లా: చెన్నూరు మండలంలో రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాషా, మేయర్ సురేష్బాబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలెంపల్లి టోల్గేట్ వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. రహదారుల నిర్మాణం కోసం ఆందోళనకు దిగిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారు.