కరువుపై చర్చకు వైయస్సార్సీపీ పట్టు

21 Mar, 2017 09:13 IST

అసెంబ్లీః రైతుల ఆత్మహత్యలు, కరువుపై చర్చకు వైయస్సార్సీపీ వాయిదా తీర్మానించింది. ఐతే, ప్రభుత్వం ఇందుకు అంగీకరించలేదు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని కరువుపై చర్చ జరపాలని వైయస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. దీంతో, శాసనసభ 10 నిమిషాలు వాయిదా పడింది.