నాగసుబ్బారెడ్డికి మృతికి సంతాపం
17 Feb, 2017 18:09 IST
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్సీపీ చెన్నూరు నాయకుడు పొట్టిపాటి ప్రతాప్రెడ్డి తండ్రి పహిల్వాన్ నాగసుబ్బారెడ్డి మృతికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, మేయర్ సురేష్బాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్రప్రసాద్రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వినర్ సంబటూరు ప్రసాద్రెడ్డి పలువురు నాయకులు సంతాపం తెలిపారు. నాగసుబ్బారెడ్డి మృతదేహానికి శుక్రవారంవారు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.