నూతన వధూవరులకు ఆశీర్వాదం
6 Apr, 2017 17:47 IST
శెట్టూరుః మండల పరిధిలోని రంగయ్య పాలెంకు చెందిన వైయస్ఆర్ సీపీ నాయకుడు రమేష్, రూపమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి వివాహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్ హనుమంతరాయుడు, గాజుల అంజి, విద్యార్థి విభాగం తాలూకా అధ్యక్షుడు నవీన్, నాయకులు దొడగట్ట సూరిలు తదితరులు ఉన్నారు.