అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. నిరంతరం కట్టుకథలు అల్లుతూ..అసత్యాలే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి మానసిక జబ్బున పడిన వారిని ఇంటికి పరిమితం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.