వైయస్‌ జగన్‌ పాదయాత్ర చ్రరితలో నిలిచిపోతోంది

20 Sep, 2018 12:44 IST
  
24న 3వేల కి.మీ మైలురాయి చేరనున్న  ప్రజా సంకల్పయాత్ర
విజయనగరంలో పైలాన్‌ ఆవిష్కరణ
వైయస్‌ఆర్‌సీపీ ప్ర«ధాన కార్యదర్శి తలశిల రఘురాం
విశాఖః వైయస్‌ జగన్‌ పాదయాత్ర చ్రరితలో నిలిచిపోతుందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఊళ్లకు ఊళ్లు కదిలొస్తున్నాయని, దేశంలో ఇంతటి ప్రజాదరణ కలిగిన నేత మరొకరు లేరన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అంతరాయం కలిగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. విజయనగరం జిల్లాలో వైయస్‌ జగన్‌3వేల కి.మీ మైలురాయి చేరుకుంటారన్నారు. ఈ నెల 24న పాదయాత్ర 3వేల కి.మీ కావస్తున్న సందర్భంగా పైలాన్‌ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2వేల కిలోమీటర్లు చేరుకున్నప్పుడు ప్రజాదరణతోనే చంద్రబాబు అంతానికి అంకురార్పణ జరిగిందన్నారు.