కరువు.. చంద్రబాబు కవలపిల్లలు

30 Apr, 2018 14:58 IST

విశాఖ‌: కరువు, చంద్రబాబు కవలపిల్లలని  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం  అభివర్ణించారు. హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబే దీక్ష చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. చంద్రబాబూ.. దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయలేవని పేర్కొన్నారు. చంద్రబాబు ఆల్‌ఫ్రీ అంటూ అందరినీ ముంచారని, మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.