వైయస్ఆర్ హయాంలో మైనారిటీలకు మేలు
11 Jun, 2018 17:09 IST
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మైనారిటీలకు మేలు జరిగిందని వైయస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాదర్బాషా ఆధ్వర్యంలో వెయ్యి మంది మైనారిటీ మహిళలకు సోమవారం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం మహానేత వైయస్ఆర్ చలవేనని అన్నారు.