ప్రకాశం జిల్లాః . హత్యాయత్నం నుంచి వైయస్ జగన్ భగవంతుని దయవల్లే బయటపడ్డారని వైయస్ఆర్సీపీ పర్చూరు వైయస్ఆర్సీపీ సమన్వయకర్త రావి రామనాథం బాబు అన్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపు ఖాయమని, జగన్ సీఎం కావడం తథ్యమని అన్నారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజలందరూ వైయస్ జగన్ను అండగా ఉన్నారన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో వైయస్ఆర్సీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు.రావి రామనాధం బాబు ఆధ్వర్యంలో చెరుకూరు నుంచి కోటప్పకొండ వరుకూ పాదయాత్ర కొనసాగుతుంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు