కష్టాలు కడతేర్చే నాయకుడొచ్చాడు

11 Aug, 2018 12:39 IST


యనమల సోదరుల అరాచకాలు అడ్డుకొని ఆదుకుంటాడని ఆశ
జననేత రాకకోసం తుని ప్రజల ఎదురుచూపు
తూర్పుగోదావరి: తమ కష్టాలు తీర్చే నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం తుని ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు, మోసకారి చంద్రబాబు ప్రభుత్వ అధికార అహం అణిచివేసేందుకు నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర నేడు 103వ నియోజకవర్గం తునిలోకి అడుగుపెడుతుందన్నారు. వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చారని రాజా అన్నారు. మంత్రి యనమల సోదరుల అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారని, జననేత వచ్చి కష్టాల నుంచి తమను కాపాడుతాడనే కొండంత ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. తుని నియోజకవర్గంలో నాలుగు రోజులు ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుందని, తుని మండలం, టౌన్‌ నుంచి కోటనందూరు మండలం మీదుగా నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు.