పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని వైయస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు సామాజిక వర్గానికి రూ. 10 వేల కోట్లు ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇవ్వడం హర్షనీయమని వైయస్ఆర్సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వైయస్ జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే కాపులకు మేలు జరుగుతుందని చెప్పారు.