హోదా సాధన జగనన్నతోనే సాధ్యం
30 Apr, 2018 16:50 IST
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా సాధన వైయస్ జగన్తోనే సాధ్యమని విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ దీక్షలో ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. అదే ఢిల్లీని ఎదురించిన వీరుడు వైయస్ జగన్ అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేవరకు అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు.