తిరుపతి: పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ద్రో హం చేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి మున్సిపాల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా వైయస్ఆర్ సీపీ ధర్నా చేపట్టింది. ధర్నాలో భూమన కరుణాకర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. దశాబ్దాలుగా నివాసముంటున్న కార్మికులను వెళ్లగొట్టాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. మంత్రి నారాయణ విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.