కిడారి హత్య వెనుక టీడీపీ నేతల హస్తం
1 Oct, 2018 13:25 IST
వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి
విజయనగరం: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీ నాయకులు హస్తం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూపిందని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి తెలిపారు. చంద్రబాబు తనకున్న ఆనవాయితీ ప్రకారం అమెరికా నుంచి ఏపీలో అడుగుపెట్టగానే అరకు వెళ్లి, కిడారి కుటుంబాన్ని పరామర్శించి, ఈ హత్య వెనుక వైయస్ఆర్సీపీ ప్రమేయం ఉందని ప్రతిపక్షంపై ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబుకు వైయస్ఆర్సీపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.