అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలను వైయస్ఆర్సీపీ నాయకులు పరామర్శించి, ఓదార్చారు. వైయస్ఆర్సీపీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్ష ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.