విశాఖపట్నం : ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని చంద్రబాబు జైలులో పెట్టించడం వంచన కాదా అని ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజలను వంచించిన బాబు దీక్ష చేయడం మరో వంచనగా అంబటి అభివర్ణించారు. ప్రత్యేక హోదా విషయలో తాను చేసింది తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం, దీక్షలు చేయాలడిమాండ్ చేశారు. నీతికి నిజాయితికి మారుపేరని, నిప్పులాంటి వాళ్లమంటూ డబ్బా కొట్టుకున్న బాబు ఇప్పుడు, నేడు ఎక్కడ జైలులో వేస్తారేమోనని భయపడిపోతున్నారని విమర్శించారు. అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్నపుడు, కుట్రలు చేసినపుడు ఎంతటి వారైనా జైలుకెళ్లక తప్పదని అంబటి హెచ్చిరించారు. చంద్రబాబు లాంటి వారిని జైలులో పెడతారనేది బహిరంగ రహస్యమేనని అన్నారు. బీజేపీ, టీడీపీలు కలిసి చేసిన మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ తనను మోసం చేసారని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే వైయస్ జగన్ బీజేపీ కలిసి పోతున్నారంటూ తన అనుకూల మీడియా సంస్థలతో, టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.