– వైయస్ జగన్తో వైయస్ఆర్సీపీ నేతల భేటీప్రకాశం: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్సీపీ ఎంపీలు పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆదివారం చీరాల నియోజకవర్గంలో కర్నూలు జిల్లా నేతలు భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక నేత వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.