విశాఖః రాజమండ్రి వర్తకులు వైయస్ఆర్సీపీలోకి చేరడం రాజమండ్రి చ్రరితలో మరిచిపోలేని రోజు అని రాజమండ్రి వైయస్ఆర్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తన గెలుపుకు అండగా వర్తకులు నిలిచారన్నారు. వర్తకులంతా వైయస్ఆర్సీపీలోకి చేరడం వైయస్ఆర్సీపీకి బలం మరింత పెరిగిందన్నారు. జిల్లాలోని వర్తక సంఘాల సభ్యులు పార్టీలోకి చేరడం సంతోషమన్నారు.