విజయవాడ: టీడీపీ ప్రభుత్వ వ్యవహారం సిగ్గు పడేలా ఉందని విజయవాడ నరగ పాలక సంస్థ వైయస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మండిపడ్డారు. నగర పాలక సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కూడా మున్సిపల్ నిధులు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నగర పాలక సంస్థ వ్యవహారం అత్త సొమ్ము అల్లుడు దానంలా ఉందని ఎద్దేవా చేశారు,