వైయస్ఆర్ జిల్లా: ఈ నెల 21న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైయస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్, ఎన్ఆర్ఐ వింగ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్స్ వింగ్ అధ్యక్షులు శివభరత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వైద్యశిబిరం పోస్టర్లను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, శివభరత్రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 19న కర్నూలు నగరంలోని ఉస్మానియ కాలేజీ గ్రౌండులో, 20న అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం నల్లమడ గ్రామంలో, 21న విజయవాడలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ శిబిరాల్లో అన్ని విభాగాలకు చెందిన వైద్యనిపుణులు పాల్గొని రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు శివభరత్రెడ్డి చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.