రాజమహేంద్రవరం లో వైఎస్సార్సీపీ ధర్నా

7 May, 2016 19:47 IST

రాజమహేంద్రవరం)) అసలైన నిరుపేదలకే ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. మునిసిపల్ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.