విజయవాడ: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్పై వైయస్ఆర్సీపీ విజయవాడ కార్పోరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ చానల్ చర్చా వేదికలో బండ్ల గణేష్ మద్యం తాగి వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విజయవాడ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్పై చర్యలు తీసుకోవాలని మహిళా కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.