వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్ల సస్పెన్షన్‌

22 Feb, 2017 13:16 IST

విజయవాడ: విజయవాడ కార్పొరేషన్ లోని మేయర్ చాంబర్ ఎదుట నిరసన దీక్ష చేపట్టిన వైయస్సార్సీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ, మేయర్ తీరును నిరసిస్తూ కార్పొరేటర్లు 24 గంటలుగా నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. నగరంలోని ఓ రోడ్డుకు టీడీపీ నేత పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్సీపీ కార్పొరేటర్లు మేయర్ చాంబర్ ఎదుట బైఠాయించడంతో వారిని బలవంతంగా లాక్కెళ్లారు.