వైయస్సార్సీపీ సమన్వయకర్తల నియామకం
24 Jul, 2016 13:02 IST
హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గాలకు వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సమన్వయకర్తలను నియమించారు. నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ముమ్మి డివరం సింగిల్ సమన్వయకర్తగా పితాని బాలకృష్ణను నియమించారు. ముమ్మిడివరం సమన్వయకర్త గుత్తుల సాయిని రాష్ట్ర పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.