ఢిల్లీలో వైయస్ఆర్సీపీ ధర్నా
5 Mar, 2018 10:44 IST
------
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు దేశ రాజధాని ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం మొదలైంది. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో వైయస్ఆర్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు ఢిల్లీలోని సంసద్మార్గ్లో మహాధర్నా చేపట్టారు. ఇందులో అశేష జనవాహిని పాల్గొని హోదా కోసం నినదిస్తున్నారు.