సుచరిత తరపున ప్రచారం
13 May, 2016 16:20 IST
ఖమ్మంః ఖమ్మం పాలేరు ఉపఎన్నికల్లో సుచరిత గెలుపుకోసం వైయస్సార్సీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పాలేరులో టీఆర్ఎస్ ను ఓడించి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలకు, నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలకు సూచించారు. పదవుల్లో ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు ఆకుటుంబంలో ఎవరు పోటీచేసినా ...వారిపై పోటీకి నిలపరాదన్నది వైయస్సార్సీపీ తీర్మానమని చెప్పారు.