పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్

12 Mar, 2015 13:33 IST
హైదరాబాద్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేటికి తన నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల అమలుకోసం ఆవిర్భవించిన ఈ పార్టీ తొలి నుంచీ ఎదురవుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం లోటస్ పాండ్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తుందని అన్నారు.