అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్సార్ సీఎల్పీ లేఖ

19 Mar, 2016 16:06 IST

హైదరాబాద్ః ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్సార్ సీఎల్పీ లేఖ రాసింది. ఎమ్మెల్యే రోజా తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున...సభా హక్కుల కమిటీ భేటీకి రాలేకపోయారని చెప్పారు. కావున సమావేశాన్ని 15 రోజుల పాటు వాయిదా వేయించాలని..రోజా తరపున వైఎస్సార్ సీఎల్పీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందించింది.