సత్తెనపల్లెలో వైయస్ఆర్ కుటుంబం

16 Sep, 2017 17:52 IST
సత్తెనపల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని 28వ వార్డులో ప్రారంభమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గం లోని పట్టణంతో పాటు సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లోని 230 పోలింగ్‌ బూత్‌ల్లో వైయస్సార్‌ కుటుంబం ప్రారంభమవుతుందన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బూత్‌ కన్వినర్లు, సభ్యులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.