జూన్ 3 నుంచి వైయస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్
31 May, 2018 13:22 IST
చిత్తూరు: వైయస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్కు క్రీడాకారులు హాజరుకావాలని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కోరారు. తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో జూన్ 3 నుంచి వైయస్ఆర్ గ్రామీణ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి వీలైనన్ని జట్లు రావాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు.