సీజీసీ సభ్యులుగా సర్రాజు..ఉండి సమన్వయకర్తగా నరసింహరాజు
26 Sep, 2017 11:22 IST
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాతపాటి సర్రాజుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సి.జి.సి.) సభ్యులుగా నియమించారు. పెనుమత్స వెంకట లక్ష్మీ నరసింహరాజుని ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.