హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించారు. బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగలో పాల్గొన్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైయస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, నారాయణస్వామి తదితర నేతలు ఎయిర్ పోర్ట్ కు పెద్ద ఎత్తున తరలివచ్చారు.