వైయస్ జగన్ దీక్ష విరమణ

2 May, 2017 15:31 IST

గుంటూరుః ప్రజాపోరాట యోధుడు, వైయస్సార్సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దీక్ష విరమించారు. రైతులు నిమ్మరసం ఇచ్చి వైయస్ జగన్ దీక్షను విరమింపజేశారు.  రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల పాటు వైయస్ జగన్ గుంటూరు వేదికగా దీక్ష కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జననేత దీక్షకు మద్దతు పలికారు.  రైతుల సమస్యలపై  మొండివైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, అన్నదాతల పక్షాన వైయస్ జగన్ పోరాటం కొనసాగిస్తున్నారు.