‘రైతు భరోసా యాత్ర’ నాలుగోరోజు పర్యటన వివరాలు

25 Feb, 2015 11:07 IST
రైతు భరోసా యాత్ర నాలుగోరోజు వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్  తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర నారాయణ వెల్లడించారు. బుధవారం ఉదయం గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం ఎద్దులపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అదే మండలంలోని అనుపంల్లిలో ఆత్మహత్య చేసుకున్న మరో రైతు ఓబన్న కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.