పులివెందుల : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే తన కుటుంబ సభ్యులతో స్థానిక సీఎస్ఐ చర్చికి వెళ్లిన వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులకు ట్విట్టర్ ద్వారా వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు.