- మహానేత వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న వైయస్ జగన్
- అనంతరం వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్: వైయస్ఆర్ కడప జిల్లాలో రేపు, ఎల్లుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రేపు (సెప్టెంబర్ 2వ తేదీ) దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్ వద్ద వైయస్ జగన్, కుటుంబసభ్యులు నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని జననేత ప్రారంభించనున్నారు. 3వ తేదీన పులివెందుల నియోజకవర్గ ప్రజలతో సమావేశం కానున్నారు.