హైదరాబాద్: ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు 2016 సంవత్సరానికి గానూ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ పురస్కారం అందుకున్న విశ్వనాథ్కు వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణమని, ఇది తెలుగు సినిమా రంగానికి ఇచ్చిన గౌరవమని వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో మరచిపోలేని సినిమాలను ఆయన అందించారని ప్రశంసించారు.