హైదరాబాద్ : భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో వారిరువురు కాంస్య, రజిత పతకాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సైనా, సింధు మరిన్ని విజయాలు సాధించాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్ చేశారు.