హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సొంత నియోజక వర్గం పులివెందులకు వెళుతున్నారు. అక్కడ ఆయన పర్యటన ఖరారు అయింది. ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పులివెందుల, లింగాల మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. ఆయా గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తారు. రైతులకు భరోసా ఇస్తారు.