విజయవాడః కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేడు విజయవాడలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. మరికొద్దిసేపట్లో వైయస్ జగన్ పున్నమిఘాట్ కు చేరుకోనున్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరిన వైయస్ జగన్ కు పార్టీశ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
విజయవాడలోని కృష్ణమ్మ నదీతీరంలో వైయస్ జగన్ పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం పుష్కరాల్లో మరణించిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారు.