నేడు, రేపు తూ.గో. జిల్లాలో వైయస్ జగన్ పర్యటన

7 Dec, 2016 10:46 IST

తూర్పుగోదావరిః ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో రంపచోడవరంలో ముఖాముఖి మాట్లాడతారు. గురువారం కూనవరం మండలంలోని రేఖపల్లి గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ కూడా ఆయన పోలవరం బాధిత ప్రజలతో మాట్లాడతారు. అక్కడి గిరిజనుల ఆరోగ్య సమస్యలను కూడా అడిగి తెలుసు కుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ మంగళవారం వెల్లడించారు.