పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..!

27 Oct, 2015 16:43 IST
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్  ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పామాయిల్ రైతులకు మద్దతుగా నిలిచేందుకు మరోసారి నవంబర్ మొదటి వారంలో జగన్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు సంబంధించి....పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై  వైఎస్ జగన్ కూలంకషంగా  చర్చించారు.