ఎల్లుండి జననేత పర్యటన

13 Jun, 2016 12:28 IST

హైదరాబాద్) ఎల్లుండి బుధవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పర్యటన ఖరారు అయింది. పర్యటన షెడ్యూల్ ను పార్టీ పగో జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజన్సీలో ప్రధానంగా పర్యటన సాగనుంది.

          బుధవారం నాడు ఉదయం 10  గంటలకు జంగారెడ్డిగూడెం వర్జీనియా పొగాకు బోర్డు వద్ద  జగన్‌మోహన్‌రెడ్డి రైతులను కలుస్తారు. అక్కడ జరిగే సభలో ప్రసంగించటంతో పాటుగాపామాయిల్, పొగాకు రైతుల కష్టాలను  తెలుసుకుంటారు. అనంతరం ఇటీవల జిల్లాలో చేరిన పోలవరం ముంపు ప్రాంతాలకు వెళతారు. మధ్యాహ్నం3 గంటలకు జగన్ కుక్కునూరు చేరుకుంటారని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో కుక్కునూరుతోపాటు వేలేరుపాడు మండల ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం కుక్కునూరు మండలం వేలేరు చేరుకుని అక్కడ సభలో బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. తర్వాత భద్రాచలం వెళతారని, ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారని నాని వివరించారు.