గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించే ముందు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ..అక్కడకు తరలి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని పవర్ ఫుల్ కామెంట్స్ కొన్ని..
- చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెబుతూ ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటారు.
- ప్రత్యేకహోదా ఇస్తామంటూ చంద్రబాబు, బీజేపీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విడగొట్టాయి
- కేసుల భయంతో ప్రధానమంత్రి దగ్గర ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబు
- పట్టిసీమ నుంచి పోలవరం దాకా, బొగ్గు నుంచి ఇసుక దాకా అంతా అవినీతిమయమే
- మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ గొప్పగా మాట్లాడిన చంద్రబాబు
- సోనియాతో కుమ్మక్కై చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు పెట్టించిన చంద్రబాబు
- రాష్ట్రాన్ని విడగొట్టడానికి వ్యతిరేకించి నిలబడిన పార్టీ వైఎస్సార్సీపీ అని చెప్పుకొనేందుకు గర్విస్తున్నా
- చంద్రబాబు పాలన అంతా మూడే మూడు పదాలు మోసం..మోసం..మోసం
- ఈ ప్రభుత్వం త్వరలోనే బంగాళాఖాతంలో కలవటం ఖాయం
- విద్యార్థుల తరపున ఎంత దాకా అయినా పోరాటానికి సిద్ధం