విజయవాడ: సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేస్తున్న వెటర్నీ విద్యార్థుల ఆందోళనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిరాహార దీక్ష శిబిరాన్ని వైయస్ జగన్ సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. జననేత హామీతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.