నేటి నుంచి కర్నూలులో వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర

5 Jan, 2017 11:07 IST

కర్నూలుః వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం బయల్దేరారు. కర్నూలు జిల్లాలో అప్పుల బాధ తాళలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన ఓదార్చి, వారిలో ధైర్యం నింపనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. ఇందులో భాగంగా వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుంటారు.