రాజ్యాంగం ఆర్టికల్ 3 సవరణకు కలిసిరండి
రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించకుండా చూసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు కలిసిరావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి బీజేపీ అగ్రనేతలను కోరారు. పార్లమెంట్ లాబీల్లో బుధవారం ఆయన బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హాలతో ఈ విషయమై దాదాపు పావుగంట పాటు మాట్లాడారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు తోడ్పాటునివ్వాలని శ్రీ జగన్ పార్టీ నాయకుల బృందంతో కలిసి లోగడ రాజ్నాథ్ను ఒకసారి కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి బీజేపీ నేతలకు ఈ విషయమై విజ్ఞప్తి చేశారు.
జగన్కు ఎంపీల అభినందనలు:
శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని పార్లమెంట్లో పలువురు ఎంపీలు అభినందించారు. సెంట్రల్ హాలులో శ్రీ జగన్ ఉండగా వివిధ పార్టీల సభ్యులు పలువురు వచ్చి ఆయనను పలకరించారు. ‘మీరు మంచి పని చేస్తున్నారు. ఒంటరిగా బాగా పోరాడుతున్నారు’ అంటూ వారు అభినందించారు.