పోటెత్తిన ఆళ్లగడ్డ

15 Nov, 2017 18:06 IST
 
ఆళ్లగడ్డ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఆళ్లగడ్డ పట్టణం జనంతో పోటెత్తింది. ఇసుక వేస్తే రాలనంతగా జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బుధవారం పర్యటించారు. సాయంత్రం ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు అశేష జనవాహిణి హాజరయ్యారు.