11గం. కు వైఎస్ జగన్ మీడియా సమావేశం

30 Apr, 2016 10:14 IST

హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడనున్నారు. ఇటీవల చంద్రబాబు నిర్లక్ష్యం, నిర్వాకంతో ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించింది. ఒక వైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం మీదనే ద్రష్టి కేంద్రీకరించి, కరువు తాగునీటి ఎద్దడి వంటి కనీస అవసరాల్ని కూడా పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని కలవర పరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియా సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.