మహనీయునికి అంజలి

15 Oct, 2015 12:15 IST
మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా మహనీయునికి వైఎస్సార్సీపీ అంజలి ఘటిస్తోంది. ఆయన చిరస్మరణీయుడు అంటూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడిగా ఎదిగి శాస్త్రవేత్తగా ప్రపంచ ఖ్యాతిని పొంది వివాద రహితుడైన రాష్ట్రపతిగా ఖ్యాతి నొందిన మహనీయుడు ఆయన. అందుకే ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. ఈ తరం యువత, విద్యార్థుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ జగన్ .. ఈ తరానికి స్ఫూర్తి దాతగా నిలిచిన అబ్దుల్ కలామ్ ను తలచుకొని అంజలి ఘటించారు.